
వైసీపీ హయాంలో వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు అన్యాయం జరిగిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 40 రోజుల్లోనే రూ.768 కోట్ల పరిహారం చెల్లించామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం నిర్వాసితులకు ఇవ్వాల్సిన రూ.900 కోట్ల పరిహారంలో ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని మంత్రి విమర్శించారు.
ఈనెల 31న సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు వద్ద జలహారతి ఇవ్వనున్నారని, నిర్వాసితులందరికీ న్యాయం చేసే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.