
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతోనే తమ సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేశారని వైకాపా నేత లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
కర్నూలు, గుంటూరు జిల్లాల్లో నమోదైన క్రిమినల్ కేసులను ప్రస్తావిస్తూ దాఖలైన ఈ పిటిషన్పై జోక్యం చేసుకోలేమని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగు ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ వ్యవహారంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్లకు సుప్రీంకోర్టు సూచించింది.