
ఒడిశా తీరంలోని పారాదీప్ ఐలాండ్కు 240 నాటికల్ మైళ్ల దూరంలో పనామా జెండా కలిగిన కార్గో నౌక శనివారం రాత్రి 10:30 గంటలకు మునిగిపోయింది.
నౌకలో ఉన్న 24 మంది సిబ్బందిలో 20 మంది చైనీయులు, ఒకరు బంగ్లాదేశీ, ముగ్గురు మయన్మార్ దేశస్థులు ఉన్నారని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
ఇండియన్ కోస్ట్ గార్డ్ మరియు నేవీ సంయుక్తంగా గాలింపు చర్యలు చేపడుతుండగా, అండమాన్ అండ్ నికోబార్ యూనిట్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది.