
ఝార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) నిర్వహించిన నియామక పరీక్షల్లో పేపర్ లీకేజీ, అక్రమాలు జరిగాయని నిరుద్యోగులు చేపట్టిన నిరసనలు తీవ్రరూపం దాల్చాయి.
నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం దిగిరావడంతో, JPSCకి చెందిన ముగ్గురు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు.
నియామక ప్రక్రియలో పారదర్శకత లోపించిందని ఆరోపిస్తూ నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.