
డెలాయిట్ ఇండియా నివేదిక ప్రకారం, క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఇంజనీరింగ్ విద్యార్థుల కంటే ఎంబీఏ విద్యార్థులకు 59 శాతం అధిక వేతనాలు లభిస్తున్నట్లు వెల్లడైంది.
టాప్-10 విద్యాసంస్థల్లో ఎంబీఏ సగటు వార్షిక ప్యాకేజీ రూ.27.4 లక్షలుగా ఉండగా, బీటెక్ గ్రాడ్యుయేట్లకు రూ.18.7 లక్షలుగా నమోదైంది.
కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావంతో 86 శాతం కంపెనీలు నియామకాల తీరును మార్చుకున్నాయని, ఏఐ నైపుణ్యాలున్న వారికి 20-25 శాతం అదనపు ప్యాకేజీ లభిస్తోందని నివేదిక పేర్కొంది.