పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సాధిక్ ఖాన్ను పోలీసులు దిల్లీలో అరెస్ట్ చేశారు.
వేధింపుల కారణంగానే నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకుందని ఆరోపణలు రావడంతో, ఈ కేసుపై రాజకీయంగా తీవ్ర చర్చ జరిగింది.
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, తదుపరి విచారణ కోసం అతడిని ఏపీకి తరలించే ప్రక్రియను ప్రారంభించారు.