
ఏపీలో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు 'సంజీవని ప్రాజెక్టు'ను జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
చిత్తూరు జిల్లాలో ఈ ప్రాజెక్టు ద్వారా హైపర్టెన్షన్ కేసులు 56 శాతం, డయాబెటిస్ కేసులు 16 శాతం నియంత్రణలోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
90 రోజుల కార్యాచరణలో భాగంగా 28 జిల్లాల్లో సిబ్బందికి శిక్షణ, డిజిటల్ హెల్త్ రికార్డుల నిర్వహణ, ఏఐ డాక్టర్ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది.