
దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ 225 బంతుల్లో 106 పరుగులతో అజేయ సెంచరీ సాధించి జట్టును ఆదుకున్నాడు.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ జోన్ 285/9 స్కోరుతో నార్త్ జోన్ కంటే 90 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
శ్రేయస్ గోపాల్ 88 పరుగులు చేసి తిలక్ వర్మతో కలిసి ఆరో వికెట్కు 175 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.