
జాతీయ భద్రత దృష్ట్యా చైనాకు చెందిన సెమీకండక్టర్ కంపెనీల నుంచి మెమరీ చిప్లను కొనుగోలు చేయవద్దని అమెరికా ఎంపీలు యాపిల్ సీఈవో టిమ్ కుక్కు లేఖ రాశారు.
సీఎక్స్ఎంటీ, వైఎంటీసీ వంటి చైనా సంస్థలు సైన్యానికి సహకరిస్తున్నాయని, వాటిపై ఆధారపడటం యాపిల్కు దూరదృష్టి లేని నిర్ణయమని ఎంపీలు హెచ్చరించారు.
ప్రపంచవ్యాప్తంగా చిప్ల కొరత కారణంగా యాపిల్ తన ఉత్పత్తుల ధరలను పెంచిన నేపథ్యంలో ఈ లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది.