భారతదేశం త్వరలోనే ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాజధానిగా అవతరిస్తుందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకణి ఆశాభావం వ్యక్తం చేశారు.
భారతీయ స్టార్టప్లు మరియు సాంకేతిక నిపుణులు ఏఐ రంగంలో వినూత్న ఆవిష్కరణలతో కొత్త దారిని చూపిస్తున్నారని ఆయన కొనియాడారు.
ఏఐ సాంకేతికత వల్ల ఉద్యోగాల కోత ఉండదని, దీనివల్ల భారత ఆర్థిక వ్యవస్థకు రూ. 28,000 కోట్ల అదనపు మార్కెట్ లభిస్తుందని వరల్డ్ బ్యాంక్ పేర్కొంది.