చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సౌత్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ 270 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు.
ఇషాన్ కిషన్ 334 బంతుల్లో 30 ఫోర్లు, 7 సిక్సర్లతో ఈ స్కోరు సాధించగా, కుమార్ కుషాగ్రా 101 పరుగులతో రాణించడంతో ఈస్ట్ జోన్ 708 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
దాదాపు 10 ఏళ్ల విరామం తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తన రెండో ద్విశతకాన్ని నమోదు చేసిన ఇషాన్, ఈ ప్రదర్శనతో టీమిండియా టెస్టు జట్టులోకి రీ-ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.