
22-A నిషేధిత జాబితాలో ప్రైవేట్ ఆస్తులు చేరడంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ, బాధితులకు క్షమాపణలు కోరారు.
మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల నుంచి మొత్తం 757 దరఖాస్తులు అందాయని, వీటి పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ప్రజలు తమ ఫిర్యాదులను 18005-994788 టోల్ ఫ్రీ నెంబర్కు తెలియజేయాలని, న్యాయబద్ధమైన ఆస్తులకు త్వరలోనే క్లియరెన్స్ ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు.