
జమ్మూకశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని అమెరికా రాయబారి సెర్గియో గోర్ బుధవారం చేసిన వ్యాఖ్యలను పాకిస్థాన్ ఖండించి, స్థానిక అమెరికా దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్లో అమెరికా రాయబారి పర్యటించడం ఇదే తొలిసారి, ఈ ప్రాంతంపై అమెరికా జారీ చేసిన 'లెవల్-4' ట్రావెల్ అడ్వైజరీని పునః పరిశీలిస్తామని గోర్ అన్నారు.
జమ్మూకశ్మీర్ వివాదాస్పద భూభాగమని, ఐరాస భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగా తుది పరిష్కారం కోసం ఎదురుచూస్తోందని పాక్ విదేశాంగశాఖ పేర్కొంది.