
హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్రోడ్స్ ప్రాంతంలో నీట్ పీజీ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న యశ్విత అనే వైద్య విద్యార్థిని శనివారం ఆత్మహత్య చేసుకుంది.
కర్నూలుకు చెందిన వ్యాపారి రామ్మోహన్ రెడ్డి కుమార్తె అయిన యశ్విత, గత ఆరు నెలలుగా హైదరాబాద్లో ఉంటూ పరీక్ష కోసం శిక్షణ పొందుతోంది.
చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినప్పటికీ, ఆమె ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.