నిల్వ ఉన్న టీని మళ్లీ వేడి చేసి తాగడం వల్ల ఫుడ్ పాయిజనింగ్, కడుపు నొప్పి, విరేచనాలు వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని డాక్టర్ బృందా ఎం.ఎస్ హెచ్చరించారు.
పాలతో చేసిన టీని గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ సేపు ఉంచితే బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుందని, ఇది ఆరోగ్యానికి హానికరం అని ఆమె తెలిపారు.
తీవ్రమైన వాంతులు, జ్వరం లేదా మగత వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని, టీని ఎల్లప్పుడూ తాజాగా తీసుకోవాలని సూచించారు.