
నేషనల్ కన్జూమర్ హెల్ప్లైన్కు 2025లో వచ్చిన ఫిర్యాదులలో ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో సంస్థలపై అత్యధికంగా ఫిర్యాదులు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది.
మింత్రా, నెట్మెడ్స్, జెప్టో, బ్లింకిట్, నాప్టాల్, వీఎల్ఈ బజార్, నైకా వంటి సంస్థలు కూడా ఈ జాబితాలో ఉన్నాయని కేంద్రమంత్రి బీఎల్ వర్మ పార్లమెంట్లో తెలిపారు.
ఈ-కామర్స్ రంగంలో వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఈ వివరాలను లిఖితపూర్వక సమాధానం ద్వారా వెల్లడించింది.