రాజన్న సిరిసిల్లలో విద్యుత్ సిబ్బంది డ్రోన్లను ఉపయోగించి పవర్ లైన్లను ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
చెరువులు, కష్టతరమైన ప్రాంతాల్లో మనుషులు వెళ్లాల్సిన అవసరం లేకుండా డ్రోన్ల ద్వారా పనిని సులభతరం చేశారు.
ఈ వినూత్న ఐడియా వల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా ప్రమాదాలు కూడా తగ్గుతాయని అధికారులు పేర్కొన్నారు.