
రాజాం మండలంలోని సారధి గెడ్డ, రుద్రసాగరం ఆక్రమణలకు గురై పొలాలుగా మారడంతో, సుమారు 50 గ్రామాల్లోని భూములకు సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
సారధి గెడ్డలో 30 కిలోమీటర్లు, రుద్రసాగరంలో 25 కిలోమీటర్ల మేర ఆక్రమణలు జరగడంతో, గొలుసుకట్టు సాగునీటి వ్యవస్థ దెబ్బతిన్నదని అధికారులు పేర్కొన్నారు.
సమస్య జఠిలంగా మారిందని, ఆక్రమణల తొలగింపునకు లక్షలాది రూపాయలు అవసరమని రాజాం తహసీల్దార్ రాజశేఖర్ తెలిపారు.