వర్షాకాలంలో ఎడీస్ దోమల ద్వారా డెంగ్యూ, అనాఫిలిస్ దోమల ద్వారా మలేరియా వ్యాపిస్తాయని, ఒకే వ్యక్తికి రెండు సోకే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, అలసట వంటి లక్షణాలు రెండింటిలోనూ సమానంగా ఉండటంతో ల్యాబ్ పరీక్షలు తప్పనిసరి అని డాక్టర్ కె. శేషి కిరణ్ తెలిపారు.
డెంగ్యూ రోగులు ఐబూప్రోఫెన్ వంటి పెయిన్ కిల్లర్స్ వాడకూడదని, ఇది రక్తస్రావం ప్రమాదాన్ని పెంచుతుందని వైద్యులు సూచిస్తున్నారు.