
టెస్ట్ క్రికెట్లో పదేపదే నో బాల్స్ వేసే బౌలర్లకు, వారి కోచ్లకు జరిమానా విధించాలని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సూచించారు.
భారత్-శ్రీలంక సిరీస్లో భారత బౌలర్లు నాలుగు ఇన్నింగ్స్లలో 20 సార్లు ఓవర్స్టెప్ చేయడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ ప్రతిపాదన చేశారు.
ఫ్రీ హిట్ విధానం కంటే జరిమానా విధానం బౌలర్లలో బాధ్యతను పెంచుతుందని, కోచ్లకు కూడా జరిమానాలో వాటా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.