
బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ 'ఈ3 ఎలక్ట్రిక్.ఏఐ' తన తొలి స్కూటర్ 'ఈ3 ట్రయాన్'ను రూ. 1 లక్ష ప్రారంభ ధరతో మార్కెట్లోకి విడుదల చేసింది.
ఈ స్కూటర్ C1, C1X, C2 అనే మూడు వేరియంట్లలో లభిస్తుండగా, C1X వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 165 కి.మీ రేంజ్ను అందిస్తుంది.
ఏఐ ఆధారిత ఆరోగ్య పర్యవేక్షణ, రిమోట్ బ్యాటరీ మానిటరింగ్ వంటి అత్యాధునిక ఫీచర్లతో పాటు 52 లీటర్ల స్టోరేజ్ సామర్థ్యాన్ని ఇందులో కల్పించారు.