భారతీయ ప్రైమరీ మార్కెట్లో ఈ ఏడాది 56 మెయిన్ బోర్డ్ ఐపీఓల ద్వారా కంపెనీలు రూ.82,895 కోట్లను సమీకరించాయి.
నిఫ్టీ ఐపీఓ ఇండెక్స్ 2415 పాయింట్ల వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకగా, గత ఏడాది కాలంలో 12 ఐపీఓలు 407 శాతం వరకు లాభాలను అందించాయి.
ఆదిత్య ఇన్ఫోటెక్ షేరు రూ.675 ఇష్యూ ధరతో మొదలై రూ.3419కి, రూబికాన్ రీసెర్చ్ రూ.485 నుంచి రూ.1776.10కి పెరిగి మల్టీబ్యాగర్లుగా నిలిచాయి.