
రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో సెక్షన్ 22-ఏ కింద నిషేధిత జాబితాలోని ఆస్తుల వివరాలను ఎందుకు బహిరంగపరచడం లేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
నిషేధిత జాబితాలో ఉన్న భూముల వివరాలు తెలియక సామాన్యులు కొనుగోలు చేసి ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.
ఈ అంశంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, విచారణను ఈ నెల 20వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.