రాబోయే ద్రవ్య పరపతి విధాన సమీక్షలలో వరుసగా రెండుసార్లు 25 బేసిస్ పాయింట్ల చొప్పున మొత్తం 50 బేసిస్ పాయింట్లు రెపో రేటును పెంచే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తేవడంతో పాటు రూపాయి మారకం విలువను స్థిరీకరించే లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఎస్బీఐ రీసెర్చ్ పేర్కొంది.
రెపో రేటు పెరిగితే బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతాయి కాబట్టి కొత్తగా రుణాలు తీసుకునే వారితో పాటు ఇప్పటికే ఈఎంఐలు చెల్లిస్తున్న వారిపై భారం పడనుంది.