
ఏఐ డీప్ ఫేక్ కంటెంట్ను తొలగించే గడువును 36 గంటల నుండి 3 గంటలకు తగ్గిస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలు తెచ్చింది.
సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏఐ ద్వారా రూపొందించిన కంటెంట్కు తప్పనిసరిగా లేబులింగ్ చేయాలని, లేనిచో సేఫ్ హార్బర్ రక్షణ కోల్పోతారని హెచ్చరించింది.
సున్నిత అంశాలపై ఫిర్యాదుల పరిష్కార సమయాన్ని 24 గంటల నుండి 2 గంటలకు, ఇతర ఫిర్యాదులను 72 నుండి 36 గంటలకు కుదించింది.