
చైనా మాస్టర్స్ సూపర్-750 టైటిల్ గెలుచుకున్న భారత డబుల్స్ జోడీ సాత్విక్ రెడ్డి-చిరాగ్ శెట్టిని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అభినందించారు.
ఈ టైటిల్ నెగ్గిన తొలి భారతీయులుగా నిలిచినందుకు వారి పట్టుదల, పోరాట స్ఫూర్తి దేశానికి గర్వకారణమని ఆయన కొనియాడారు.
రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించి దేశ కీర్తిని పెంచాలని జగన్ ఆకాంక్షించారు.