
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందిస్తూ, ఈ అంశాన్ని క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తోందని, నివేదిక వచ్చాక ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
పార్టీలో స్వేచ్ఛ ఉన్నప్పటికీ హద్దులు దాటితే చర్యలు తప్పవని హెచ్చరించిన మహేశ్, 70 శాతం పదవులు పాత కాంగ్రెస్ నాయకులకే దక్కేలా అధిష్ఠానం హామీ ఇచ్చిందని స్పష్టం చేశారు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించిన ఆయన, ప్రధాని మోదీ హవా తగ్గిందని, ఎన్ని ఎన్నికలు జరిగినా ఆయన ఇంటికి వెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు.