
దుబాయ్లోని కీలకమైన జెబెల్ అలీ పారిశ్రామిక ప్రాంతం మరియు పోర్టులో బుధవారం కేవలం 20 నిమిషాల వ్యవధిలో ఏడు భారీ పేలుళ్లు సంభవించాయి.
ఈ పేలుళ్ల వల్ల భారీగా మంటలు, దట్టమైన పొగలు వ్యాపించాయని, యెమెన్కు చెందిన హుతీ తీవ్రవాదులే క్షిపణులతో దాడి చేసి ఉంటారని ఇరాన్ మీడియా సంస్థ మెహెర్ పేర్కొంది.
యూఏఈ అధికారులు పేలుళ్లను ధ్రువీకరించినప్పటికీ, ప్రాణనష్టం లేదా దాడికి గల కారణాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.