
హైదరాబాద్ ఫూల్బాగ్లోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో రూ. 20,000 లంచం తీసుకుంటుండగా టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ ప్రభావతిని ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
అవినీతిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు మంగళవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఈ చర్య తీసుకున్నారు.
ప్రభావతిపై కేసు నమోదు చేసిన అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.