
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి సెప్టెంబర్ 4న తెల్లవారుజామున 2.55 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్ 17 రాకెట్ను ఇస్రో ప్రయోగించనుంది.
ఈ ప్రయోగం ద్వారా EOS-05 ఉపగ్రహాన్ని సుమారు 28,934 కిలోమీటర్ల ఎత్తులోని జియోస్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ (GTO)లోకి ప్రవేశపెట్టనున్నారు.
ఈ ఏడాది చేపట్టనున్న ఏడు రాకెట్ ప్రయోగాల్లో ఇది మొదటిదని, ప్రయోగానికి 27 గంటల ముందు కౌంట్డౌన్ ప్రారంభం కానుందని ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ తెలిపారు.