
ఏపీలో ఉద్యోగులు, పెన్షనర్లకు అక్టోబర్ నుంచి రెండు డీఏలు చెల్లించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు వైఎస్సార్సీపీ నేత నలమారు చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రభుత్వం ఉద్యోగులకు రూ.40 వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉందని, వెంటనే 30 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈహెచ్ఎస్ బకాయిలు చెల్లించకపోవడంతో ఆస్పత్రులు వైద్య సేవలను నిరాకరిస్తున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని ఆయన హెచ్చరించారు.