
నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలోని చేర్కూర్ ప్రాథమిక పాఠశాలలో గురువారం విద్యార్థులు, ఉపాధ్యాయులు రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసలు ముఖ్య అతిథిగా హాజరై, తోబుట్టువుల అనురాగానికి రక్షాబంధన్ ప్రతీక అని పేర్కొన్నారు.
విద్యార్థులు ఒకరికొకరు రాఖీలు కట్టుకుని స్వీట్లు పంచుకుంటూ, సంప్రదాయాలను మరియు సోదరభావాన్ని పెంపొందించుకున్నారు.