ఐపీఎల్లో వివాదాస్పదంగా మారిన 'ఇంపాక్ట్ ప్లేయర్' నిబంధనపై ఫీడ్బ్యాక్ ఇవ్వాలని బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలను కోరింది.
ఆగస్టు 31లోపు తమ క్రికెట్ ఆపరేషన్స్ టీమ్లతో చర్చించి నివేదిక సమర్పించాలని ఫ్రాంచైజీలకు బీసీసీఐ గడువు విధించింది.
ఈ నిబంధన వల్ల ఆల్రౌండర్ల ప్రాధాన్యత తగ్గడం, బౌలర్లపై ప్రభావం పడటం వంటి అంశాలపై రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లు ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేశారు.