
ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఆగస్టు 17 నుంచి 23 వరకు జరగనున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కోసం కోతుల బెడదను నివారించేందుకు నిర్వాహకులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
కోతులను భయపెట్టేందుకు కొండముచ్చుల అరుపులను అనుకరించే ముగ్గురు వ్యక్తులను ప్రత్యేకంగా నియమించారు.
గత ఇండియా ఓపెన్ సమయంలో కోతులు గ్యాలరీల్లోకి రావడంతో ఈ వింత పరిష్కారాన్ని అమలు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.