
ప్రస్తుత వాతావరణ మార్పుల వల్ల హెచ్1ఎన్1 (స్వైన్ ఫ్లూ) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది.
తీవ్రమైన జ్వరం, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలు ఉన్నవారు ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకోవాలని, ద్రవాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలని సూచించింది.
ఐదు రోజులైనా జ్వరం తగ్గకపోయినా లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగినా వెంటనే ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.