
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై క్రమశిక్షణ కమిటీ నివేదిక సమర్పించడంతో ఆమెపై వేటు పడే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సురేఖ కుమార్తె సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను బహిరంగంగా ఖండించకపోవడంతో పార్టీ అధిష్టానం ఆమెపై ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం.
పార్టీ చర్య తీసుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే యోచనలో సురేఖ ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నా, ఆమె ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.