
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన మణికట్టుకు జరిగిన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో, సతీమణి ఉపాసనతో కలిసి కోయంబత్తూరులోని అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.
సర్జరీ తర్వాత ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో ఆయన మొక్కులు తీర్చుకోవడానికి ఈ ఆలయ సందర్శన చేశారు.
త్వరలోనే రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో చేయబోయే కొత్త సినిమా షూటింగ్లో పాల్గొననున్నట్లు సమాచారం.