
మంగళవారం ఉదయం 9:45 గంటలకు సెన్సెక్స్ 249 పాయింట్లు (0.32%) నష్టపోయి 77,479 వద్ద, నిఫ్టీ 50 పాయింట్లు (0.21%) నష్టపోయి 24,236 వద్ద ట్రేడవుతున్నాయి.
వెల్స్పన్ లివింగ్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ వంటి కంపెనీలు లాభాల్లో ఉండగా, కోల్గేట్-పాల్మోలివ్, లోధా డెవలపర్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు నష్టాలను నమోదు చేస్తూ ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి.