
జైపూర్లో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2026 పోటీల్లో 52 మందిని వెనక్కి నెట్టి కేరళకు చెందిన 19 ఏళ్ల కజియా లిజ్ మెజో విజేతగా నిలిచారు.
ఈ పోటీల్లో తమిళనాడుకు చెందిన వైష్ణవి గణేశ్ తొలి రన్నరప్గా, గుజరాత్కు చెందిన అనుశీ సాత్వలేకర్ రెండో రన్నరప్గా నిలిచారని నిర్వాహకులు ప్రకటించారు.
నవంబరులో ప్యూర్టోరికోలో జరగనున్న 75వ మిస్ యూనివర్స్ అంతర్జాతీయ పోటీల్లో కజియా లిజ్ మెజో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.