
ప్రముఖ టెక్ సంస్థ ఒరాకిల్లో మరోసారి ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది.
కంపెనీ పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా లేఆఫ్ జాబితాలో ఉన్న సిబ్బందికి ఉదయం 6 గంటల నుంచే 'టుడే ఈజ్ యువర్ లాస్ట్ వర్కింగ్ డే' అంటూ ఈమెయిల్స్ రావడం కలకలం సృష్టించింది.
ఉద్యోగి పనితీరు ఆధారంగా కాకుండా ప్రస్తుత వ్యాపార అవసరాలను బట్టి ఈ తొలగింపులు చేపట్టినట్లు కంపెనీ పేర్కొనగా, ప్రభావితమైన ఉద్యోగులకు సెవరెన్స్ ప్లాన్ నిబంధనల ప్రకారం పరిహారం అందనున్నట్లు సమాచారం.