
సుమన్, సాయికుమార్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో 'ధర్మస్థల నియోజకవర్గం' చిత్రం రూపొందింది.
మేరుం భాస్కర్ నిర్మించిన ఈ సినిమా డ్రగ్స్ దురాచారానికి వ్యతిరేకంగా సాగే కథాంశంతో తెరకెక్కింది.
ఈ చిత్రంలో నటరాజ్, వితికా షేరు కూడా కీలక పాత్రల్లో నటించగా, ఇది ఒక పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది.