
విశాఖపట్నంలో రూ.2 వేల కోట్ల పెట్టుబడితో ఏఐజీ హాస్పిటల్స్ నిర్మాణానికి మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు.
ఈ ఆసుపత్రి ప్రాజెక్టులో 9 ఎకరాల్లో ఆసుపత్రి క్యాంపస్, 2.5 ఎకరాల్లో నర్సింగ్ కళాశాల ఉండనుండగా, మొత్తం 1000 పడకల సామర్థ్యం కల్పించనున్నారు.
మొదటి దశలో 650 పడకలతో 2028 అక్టోబర్ నాటికి పనులు పూర్తి చేయనుండగా, దీని ద్వారా సుమారు 9 వేల మందికి ఉపాధి లభించనుంది.