
కోల్కతా నుంచి చెన్నై వస్తున్న ఇండిగో విమానం ఎడమవైపు ఇంజిన్ గాల్లో ఉండగా విఫలం కావడంతో మంగళవారం అర్ధరాత్రి చెన్నై విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు.
విమానంలో ఉన్న 224 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని, పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సహాయంతో రన్వేపై విమానాన్ని సురక్షితంగా దించారని అధికారులు తెలిపారు.
ఇంజిన్ సాంకేతిక లోపాన్ని గుర్తించిన వెంటనే పైలట్ అత్యవసర చర్యలు చేపట్టడంతో, విమానాశ్రయ సిబ్బంది రన్వేపై అన్ని జాగ్రత్తలు తీసుకుని విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా చేశారు.