
హైదరాబాద్ నాంపల్లిలోని పోక్సో కోర్టు 2015 నాటి బాలికల అక్రమ రవాణా కేసులో 33 మంది నిందితులను దోషులుగా తేల్చి శిక్షలు ఖరారు చేసింది.
ఈ కేసులో ఐదుగురికి జీవిత ఖైదు, ముగ్గురికి 14 ఏళ్లు, 25 మందికి మూడు నుంచి పదేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష పడింది.
బాధిత బాలికలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.45 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.