
మంత్రి కొండా సురేఖ అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ఎటువంటి ఆదేశాలు అందలేదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
మహబూబాబాద్లో జరిగిన స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మంత్రి సురేఖ ఫొటో లేకపోవడంపై వివాదం నెలకొంది.
స్థానిక నాయకుల లోపం వల్లే ఫ్లెక్సీలో ఫొటో కనిపించలేదని, దీనిపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి సీతక్క వివరణ ఇచ్చారు.