
టాటా సన్స్ కంపెనీ చరిత్రలో మొదటిసారిగా 108వ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) క్వోరమ్ లేకపోవడంతో వాయిదా పడింది.
టాటా సన్స్ లో 51.5 శాతం వాటా కలిగిన సర్ దొరాబ్జి టాటా ట్రస్ట్ మరియు సర్ రతన్ టాటా ట్రస్ట్ ప్రతినిధులు హాజరుకాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
సర్ రతన్ టాటా ట్రస్ట్ మీటింగ్ లపై మహారాష్ట్ర చారిటీ కమిషనర్ ఆంక్షలు విధించడంతో, సంయుక్త నామినేషన్ సాధ్యం కాక ఈ సమావేశం వాయిదా పడింది.