
రాజమహేంద్రవరంలో కారు ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ మరణించిన వైద్య విద్యార్థిని ప్రియాంక కుటుంబానికి ఏపీ సీఎం చంద్రబాబు రూ.20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
ఈ నెల 3న మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు ప్రియాంకను కారుతో ఢీకొట్టగా, సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె బ్రెయిన్ డెడ్ కావడంతో మృతి చెందింది.
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించడంతో పాటు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.