
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు యూకేకు చెందిన సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించింది.
రాష్ట్ర పట్టణాభివృద్ధిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సుస్థిర మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
అంతర్జాతీయ నైపుణ్యంతో అమరావతిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది.