
తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదని మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి లేఖ రాశారు.
తన కుమార్తె వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని, తనను బాధ్యురాలిని చేయడం సరికాదని ఆమె పేర్కొన్నారు.
తనకు జారీ చేసిన క్రమశిక్షణ నోటీసును ఉపసంహరించుకోవాలని ఆమె కమిటీని కోరారు.