
నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) రోబోటిక్ సర్జరీ విభాగంలో 1000 శస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి రికార్డు సృష్టించింది.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ మైలురాయిని అధిగమించిన తొలి సంస్థగా నిమ్స్ నిలిచింది.
రోబోటిక్ సర్జరీ సేవలను ప్రారంభించిన కేవలం మూడేళ్ల వ్యవధిలోనే ఈ ఘనతను సాధించడం విశేషం.